వర్ధన్నపేట, సెప్టెంబర్ 21 : అన్నదాతల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అకాల వర్షాలకు పంట లు పాడైపోవడంతో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నష్టం పరిహారం చెక్కులను వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణం సమీపంలోని లక్ష్మీగార్డెన్స్లో జరిగిన సమావేశంలో రైతులకు చెక్కులు అందించి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితిని మెరుగు పరిచేందుకు సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. గో దావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందిస్తున్నారన్నారు. అంతేకాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో మేలైన విత్తనాలు, ఎరువులు అందిస్తుండడంతో రైతులు సమృద్ధిగా పంటలు పండిస్తున్నారన్నారు.
అంతేకాక పంటల సాగుకోసం పెట్టుబడిని కూడా ప్రభుత్వం రైతుబంధుతో అందిస్తోందన్నా రు. రైతు కుటుంబాలకు భరోసానిచ్చేలా రైతుబీమాను కల్పిస్తున్నట్లు వివరించారు. రైతులు అకాల వర్షాలతో నష్టపోతే వారికి అండగా నష్ట పరిహారాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కేవలం వర్ధన్నపేట మండలానికి చెందిన 1,013 మంది రైతులకు రూ.72.24లక్షల చెక్కులను మంజూరు చేసినట్లు వివరించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు రైతులకు చేయలేని అనేక కార్యక్రమాలను తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్ చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, రైతుబంధు సమితి కన్వీనర్ మోహన్రావు, వైస్ ఎంపీపీ సోమలక్ష్మి, ఏడీఏ సురేశ్కుమార్, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హసన్పర్తి : అభివృద్ధి సంక్షేమాన్ని చూసే వివిధ పార్టీల నుంచి అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55వ డివిజన్ పరిధి భీమారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే రమేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం అరూరి రమేశ్ మాట్లాడుతూ కొత్తపాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీకోసం పనిచేయాలన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, సిరంగి సునీల్, డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్, మణింద్రనాథ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, విక్టర్బాబు, సురేశ్ పాల్గొన్నారు. కాగా, భీమారంలోని మహిళా కమ్యూనిటీ భవనంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ను ఎమ్మెల్యే అరూరి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లు, మెప్మా పీడీ భద్రునాయక్, రమేశ్, రాజేశ్ పాల్గొన్నారు.
ఐనవోలు : తెలంగాణలో ప్రతిపక్షాలు చెప్పే మాటలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నందనం, వనమాలకనపర్తి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షుడు యాకర నర్సింహులు, మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్, చంద్రయ్య, దివ్యాంగుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు జనార్దన్, సీనియర్ నాయకులు ఎల్లయ్య, ఏలియా, రవి, భాస్కర్తో పాటు సుమారుగా 90 మంది బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు పొలెపల్లి శంకర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నందనం గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. జడ్పీ వైస్చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ మునిగాల సంపత్కుమార్, జయపాల్, మెహన్, చందర్రావు, బాబు, రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, కొమురయ్య, భాస్కర్, నరేశ్, కోమలత, సర్పంచ్లు మంజుల, కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, ఉప సర్పంచ్ సతీశ్, గ్రామ అధ్యక్షుడు లవణ్, రాజు, ఏలియా, దేవదాసు పాల్గొన్నారు.