నర్సంపేట/చెన్నారావుపేట/గీసుగొండ, ఫిబ్రవరి 16: జననేత ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సంపేటలో అన్నదానం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. పంటలకు సాగునీరు అందించేందుకు అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఇరుకు కోటేశ్వర్రావు, కార్యదర్శి, భూపాల్రావు, గోనెల రవీందర్, దేవునూరి అంజయ్య, శింగిరికొండ మాధవశంకర్, శివ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా నర్సంపేటలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చెన్నారావుపేటలోని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ నాయకుడు సాదు నర్సింగరావు పాల్గొని రక్తదానం చేశారు. వీరికి జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు, నర్మెట్ట సాంబయ్య, ఆకులపెల్లి ఉప్పలయ్య, ఈసంపెల్లి ఐలయ్య, పైసా సారంగం పాల్గొన్నారు. పరకాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో గీసుగొండ మండలం ఎలుకుర్తికి చెందిన టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి ఐలోని అభిషేక్ పాల్గొని రక్తదానం చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, సర్పంచ్లు పూండ్రు జైపాల్రెడ్డి, దౌడు బాబు, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు ప్రసాద్, ప్రమోద్, సునీల్, లెనిన్ ఉన్నారు.
నర్సంపేటరూరల్/పర్వతగిరి/నెక్కొండ: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ముగ్ధుంపురం ప్రాథమికోన్నత పాఠశాలలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ బీసీసెల్ నర్సంపేట మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, సభ్యులు రాజేశ్వర్రావు, ఆర్బీఎస్ మండల ఉపాధ్యక్షుడు చీకటి రాజాగౌడ్, సర్పంచ్ పెండ్యాల జ్యోతి, పార్టీ గ్రామ అధ్యక్షుడు భిక్షపతి, పెండ్యాల ప్రభాకర్ పాల్గొన్నారు. రాజపల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గ్రామ అధ్యక్షుడు పొన్నం రమేశ్, కార్యదర్శి గోపు వీరారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులు, గ్రామస్తులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుర్రాల రాఘవరెడ్డి, పోగుల మల్లయ్య, నర్ర వీరస్వామి, నూనె కొమురయ్య, రఘుపతి, అరుణాకర్ పాల్గొన్నారు. అదేవిధంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేయగా, ఎంపీపీ మోతె కళావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పర్వతగిరి మండలంలోని యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ చినపాక శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమడగాని రాజుయాదవ్, ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, కరిమిల్ల దుర్గారావు, నాయకులు వల్లందాసు రంగయ్య, దాడి వినయ్, కందికొండ అఖిల్, దాడి ప్రవీణ్ తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. నర్సంపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నెక్కొండ సొసైటీ ఛైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో ఎంపీపీ జాటోత్ రమేశ్నాయక్, నాయకులు గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, కట్కూరి నరేందర్రెడ్డి, మాదాసు రవి, రవీందర్రావు, యువకులు రక్తదానం చేశారు. వీరిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అభినందించారు.
పోచమ్మమైదాన్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి వరంగల్ కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డులోని గాయత్రికాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, మాజీ మేయర్ డాక్టర్ గుండా ప్రకాశ్రావు, నాయకులు రాజనాల శ్రీహరి, బాసాని శ్రీనివాస్, బేతి రాజు, ఉదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందమంది పేద మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఆకుల భాగ్యలక్ష్మి, డాక్టర్ అర్పిత, డాక్టర్ నిఖిల, హరి రమేశ్బాబు, రామకిశోర్, ప్రభాకర్, మహేశ్ పాల్గొన్నారు.
కరీమాబాద్/మట్టెవాడ: ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రంగశాయిపేటలోని మంకీఫుడ్ కోర్టులో 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వొగిలిశెట్టి అనిల్కుమార్, కోరె కృష్ణ, ఆవునూరి రామన్న, మరుపల్ల గౌతమ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ బస్వరాజు శిరీషా శ్రీమాన్ ఆధ్వర్యంలో మండిబజార్ జెండాల వద్ద కేక్ కట్ పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి, డాక్టర్ హరిరమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ నేతృత్వంలో నాయకులు శ్రమదానం నిర్వహించారు. మైలారం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని జయరాంతండా, బాల్నాయక్ తండా, సన్నూరు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న మట్టి రోడ్డుపై మొరం పోయించి మరమ్మతులు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, గబ్బెట బాబు, ముత్తడి సాగర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సర్పంచ్ బానోత్ పద్మ రవినాయక్, ఎంపీటీసీ భూక్యా గోవింద్నాయక్, అశ్రఫ్పాషా, ఎల్లస్వామి, రమేశ్, జగన్, లఖ్యా, భద్రూ పాల్గొన్నారు.