వరంగల్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. శనివారం గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు రూ. 200 పెన్షన్ ను ఇచ్చే వారని, అవి తీసుకొనేందుకు కూడా లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆసరా పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని వృద్ధులు, వితంతువులకు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి పెన్షన్ లు అందుతున్నాయన్నారు.