నాడు సరైన సౌకర్యాలు లేక కళతప్పిన సర్కారు బడులు, నేడు సకల వసతులు, సరికొత్త రూపురేఖలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారాయి. ‘మన ఊరు-మన బడి’తో సరికొత్త హంగులను అద్దుకు న్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో అదనపు తరగతి గదులు, అధునాతన మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, కిచెన్ షెడ్లు, వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీ, డ్యుయల్ డెస్క్లు, బ్లాక్ బోర్డులు, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ను సమకూర్చుకున్నాయి. జిల్లాలో తొలి విడుతలో 223 పాఠశాలలు ఎంపిక కాగా, 58.13 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మొదటి విడుత అభివృద్ధి చేసిన స్కూళ్లలో ఎనిమిది పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. వీటిని రేపు ప్రజా ప్రతినిధులు ప్రారంభించనుండగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్, జనవరి 30(నమస్తేతెలంగాణ): విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమా న్ని చేపట్టింది. ఇందులో భాగంగా తొలివిడుత 223 పాఠశాలలకు రూ.58,13,03,792 మంజూరు చేసిం ది. రూ.30 లక్షలలోపు నిధులు మంజూరైన పాఠశా లల్లో అభివృద్ధి పనులను ఎస్ఎంసీలకు అప్పగించింది. రూ.30 లక్షలకుపైగా నిధు లు మంజూరైన వాటిని టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు కేటాయిం చింది.
ఎస్ఎంసీలు, కాంట్రాక్టర్లు ఆయా పాఠశాల హెచ్ఎంలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యా ర్థుల సమన్వయంతో స్కూళ్లలో గుర్తించిన అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో గదు ల మర మ్మతులతో పాటు రన్నింగ్ వాటర్తో కూడిన టాయి లెట్స్, హ్యాండ్వాష్లు, డైనింగ్ హాలు, కిచెన్ గది, ప్ర హరీ నిర్మిస్తున్నారు. తాగునీటి సరఫరా, తరగతి గదు ల్లో డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్బోర్డులు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటుతో పాటు ఇతర విద్యుద్దీక రణ పనులు చేస్తున్నారు. పునర్ నిర్మాణ పనులు పూర్తి కాగానే పె యింటింగ్ పనులు చేస్తున్నారు. 222 పాఠ శాలల్లో అ భివృద్ధి పనులు చేపట్టినట్లు అధికారులు వెల్ల డించారు.
అభివృద్ధి పనులు వేగవంతం
ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలికాలంగా మన బడి పనులను మరింత వేగవంతం చేసినట్లు అధికా రులు తెలిపారు. ఎస్ఎంసీల చేపట్టిన పలు పా ఠశాలల్లో పనులు తుది దశకు చేరాయి. కొన్ని పాఠశా లల్లో పెయింటింగ్ పనులు మాత్రమే జరగాల్సి ఉంది. గతంలో కనీస వసతులు కరువైన సర్కారు పాఠశాలల్లో ఇప్పుడు అనేక వసతులు సమకూరుతుండడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వంటి పాఠశాలల్లో తమ పిల్లలు చదువు కుంటున్నారని వారి తల్లిదండ్రులు ఆనందం వెలిబుచ్చుతున్నారు.
ప్రారంభానికి సిద్ధమైన స్కూళ్లు
పెయింటింగ్ సహా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఎనిమి ది ఎనిమిది పాఠశాలలను బుధవారం ప్రారంభించేం దుకు అధికారులు ముస్తాబు చేశారు. వీటిలో గీసుగొం డ మండలం మొగిలిచర్లలోని ఎంపీపీఎస్, రాయపర్తి మండలం కొత్తూరులోని ఎంపీపీఎస్, నల్లబెల్లి మండ లం రేలకుంట, నల్లబెల్లిలోని ఎంపీపీఎస్లు, పర్వతగిరి లోని జడ్పీఎస్ఎస్, ఎంపీపీఎస్, సంగెం మండలం మొండ్రాయి, పల్లారుగూడలోని ఎంపీపీఎస్, ఎంపీ యూపీఎస్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ స్కూళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
చాలా హ్యాపీగా ఉంది..
– స్వరూప, హెచ్ఎం, మొగిలిచర్ల పీఎస్
‘మన ఊరు- మన బడి’తో పాఠశాల రూపురేఖలు మారా యి. అనేక వసతులు ఏర్పడ్డా యి. తరగతి గదుల్లో డ్యూ య ల్ డెస్క్లు, గ్రీన్ చాక్ బోర్డు, ఫ్యాన్లు, లైట్లను ఏర్పాటు చేశా రు. హ్యాండ్ వాష్, రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్స్, కిచెన్ షెడ్, ప్రహరీ నిర్మాణం జరిగింది. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి లో వసతులు సమకూరడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు సంబుర పడుతున్నరు..
– నర్ర స్వప్న, పేరెంట్
ఈ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతాండ్లు. గతం లో ఇందులో సౌకర్యాలేమి లేవు. టాయిలెట్స్ లేక పిల్లలు చాల ఇబ్బంది పడ్డారు. ఈ స్కూల్కు పంపడానికి ఆలో చించేటోళ్లం. ఇపుడు మన బడి కార్యక్రమంతో స్కూల్ మంచిగా తయారైంది. ప్రైవే టు పాఠశాలల కంటే బాగుంది. చాలా సౌకర్యా లేర్పడ్డాయి. ఇపుడు పిల్లలు చాల సంబురపడుతున్నరు.
అన్ని హంగులతో మొగిలిచర్ల పాఠశాల
శిథిలావస్థకు చేరిన భవనం. కొరవడిన మరమ్మ తులు. పెయింటింగ్ లేక వెక్కిరించిన గదులు. కరం టు, నీటి సరఫరా, టాయిలెట్స్, ప్రహరీ లేని వైనం. కిచెన్ గది లేకపోవడంతో మధ్యాహ్న భోజనం కోసం ఆరు బయట వంట. కొద్ది నెలల క్రితం వరకు గీసు గొండ మండలం మొగిలిచర్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్య క్రమంలో భాగంగా ఈ పాఠశాల అభివృద్ధికి రూ. 13,31,428 మంజూరు చేసింది. ఎస్ఎంసీ ద్వారా కొద్ది నెలల క్రితం ఈ నిధులతో వివిధ అభివృద్ధి పను లు చేపట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల హెచ్ఎంలు, పూర్వ విద్యార్థుల సహకారంతో కార్పొ రేట్ స్థాయిలో తీర్చిదిద్దింది. పాఠశాల భవనానికి మ రమ్మతులతోపాటు ఏడు గదుల్లో విద్యుద్దీకరణ జరి గింది.
ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు లైట్లను ఏర్పాటు చేశారు. గదికో గ్రీన్ చాక్ బోర్డు అమర్చారు. ప్రతి గదిలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లను సమకూర్చారు. రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలె ట్లు నిర్మించారు. హ్యాండ్వాష్తో పాటు తాగునీటి వసతి కల్పించారు. మధ్యాహ్న భోజనం తయారీ కోసం కిచెన్ గది నిర్మించారు. పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆవరణలో ట్రాక్లను ఏర్పాటు చేశారు. పెయింటింగ్ కూడా వేయడంతో ఈ పాఠశాలకు కార్పొరేట్ లుక్ వచ్చింది. దీంతో విద్యార్థులు మురిసిపోతున్నారు. ఈ పాఠశాల ఏడు గదుల్లో ఐదింటిలో విద్యార్థులకు బోధన జరుగు తుండగా ఒక గదిని హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటున్నారు. మరో గదిలో లైబ్రరీ కార్నర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాఠశాలను బుధవారం ప్రారంభించేందుకు అధికా రులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.