కాజీపేట, ఏప్రిల్ 1 : కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వెల్లడించారు. పాఠశాల మైదానంలో సభ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కిట్స్ కాలేజీ ప్రాంగణానికి హెలీకాప్టర్ ద్వారా చేరుకుని ఎర్రగట్టులో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అనంతరం హనుమకొండలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. నగరంలో రూ.150 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
వరదలతో ముంపు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ఇప్పటికే రూ.70 కోట్లు కేటాయించారని, నిర్మాణ పనులకు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే సైన్స్ పార్కు, మాడల్ వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో 50 వేల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారని వివరించారు. కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు ఎలకంటి రాములు, సంకు నర్సింగరావు, వేముల శ్రీనివాస్, కార్మిక నాయకుడు పుల్ల శ్రీనివాస్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బోజు శ్రీకాంత్చారి, నాయకులు నార్లగిరి రమేశ్, జనార్దన్ గౌడ్, జోరిక రమేశ్, సోనీ, పులి రజినీకాంత్, నయీం, సంపత్రెడ్డి పాల్గొన్నారు.