ఖానాపురం, జూలై 12: జిల్లాలోని తండాల్లో మంగళవారం సీత్లాభవాని వేడుకలు ఘనంగా జరిగాయి. ఖానాపురం మండలం ఐనపల్లిలో జరిగిన వేడుకల్లో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, శాంత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తమ సంస్కృతీ సంప్రదాయలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏటా ఆషాఢమాసంలో గిరిజనులు పాడిపంట, పశుసంపద చల్లగా ఉండాలని సీత్లాభవానికి పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు. వేడుకల్లో నాజీతండా సర్పంచ్ బదావత్ బాలకిషన్, రామోజీ, నిమ్మ, హేమ్ల, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/రాయపర్తి: సీత్లాభవాని(గొడ్ల దాటుట) వేడుకలను తండాల్లో ఘనంగా నిర్వహించారు. భాంజీపేట, భోజ్యానాయక్తండా, పర్శనాయక్తండా, అమృతండా, హేమ్లతండా, హనుమాన్తండా, ఏనుగల్తండా, గార్లగడ్డతండాలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భోజ్యానాయక్తండాలో సర్పంచ్ భూక్యా లలితా వీరూనాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు సీత్లాభవానిని భక్తిశ్రద్ధలతో కొలిశారు. అనంతరం గొడ్ల దాటుడు కార్యక్రమాలు చేట్టారు. కుల పెద్దలు అజ్మీరా నారాయణ, శివరాం, నాగు, వీరన్న, అజ్మీరా సూరయ్య, తిరుపతి, డప్పు భద్రు, రాజు, జామ్ల, జగ్గు, భూక్యా పూల్సింగ్, బానోత్ తేజ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలోని తండాల్లో శీత్లాభవాని వేడుకలను గిరిజనులు నిర్వహించారు. ఈర్యతండాలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కృష్ణచైతన్య పాల్గొని పూజలు చేశారు.
ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, నాయకులు ఉన్నారు. రాయపర్తి మండలంలోని జేతురాంతండా పరిధి విద్యానగర్తండాలో జరిగిన వేడుకల్లో జాటోత్ సంగీత, తేజస్వి, సరిత, కవిత, బుజ్జి, ప్రమీల, విమల, అనిత, సునిత, మంజుల, బాలునాయక్, అనిల్కుమార్, శ్రీనివాస్, వెంకన్న, యాకూబ్, ఈర్యా పాల్గొన్నారు. పర్వతగిరి మండలం పెద్దతండాలో పర్వతగిరి ఎంపీపీ లునావత్ కమల, పూజారి రవి, సర్పంచ్ లునావత్ గణేశ్, ఉపసర్పంచ్ వీరన్న, మాజీ సర్పంచ్ రూప్లానాయక్, విఘ్నేశ్ పాల్గొన్నారు.