దామెర, అక్టోబర్ 2: సాధించుకున్నాక సీఎం కేసీఆర్ అనతికాలంలోనే మిషన్భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధిచేసిన గోదావరి జలాలు, గ్రామాలకు 24గంటల కరెంటు ఇస్తూ అన్నివిధాలుగా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సింగరాజుపల్లిలో రూ.3.4కోట్లతో గ్రామం నుంచి హరిచంద్రనాయక్ తండా వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్స్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
అధిక నిధులను తీసుకువచ్చి ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతో భూముల ధరలకు వచ్చాయని చెప్పారు. ఏండ్లుగా ఎదురుచూస్తున్న సింగరాజుపల్లి నుంచి హరిచంద్రనాయక్ తండా వరకు రూ.3.4కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల రైతులు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ ఎన్నికలు సమీపిస్తుంటే ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గ్రామాలకు వచ్చే ఆ పార్టీల నాయకులను ప్రజలు తరమికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశ్వీదించాలని కోరారు. దళితబంధు అర్హులైన ప్రతి ఒక్కరికీ వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, సర్పంచ్లు రజిత, పున్నం రజితసంపత్, కుక్క శ్రావణ్య అనిల్, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, సంగనబోయిన మౌనికా కిరణ్, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో కాసర్ల రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గండు రామకృష్ణ, ఉపసర్పంచ్ బాబు, గోల్కొండ సాంబయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ తోట బాబురావు, గ్రామ అధ్యక్షులు ఉప్పుల శివ, బొనగాని రాజు, కొసనం సత్యం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దాడి మల్లయ్య, దామెరుప్పుల శంకర్, ఎస్ఈ శంకరయ్య, డీఈ లింగారెడ్డి పాల్గొన్నారు.