మహబూబాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కేవైసీ కోసం వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఇక ఉండదు. వినియోగదారుల ఇంటి వద్దనే ఈ -కేవైసీని పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు నిర్ణయించారు. ఇందుకోసం డెలివరీ బాయ్ సెల్ ఫోన్లలో ఈ-కేవైసీ యాప్ను డౌన్లోడ్ చేశారు.
వారు వినియోగదారుడి ఇంటి వద్దనే సులువుగా ఈ కేవైసీ పూర్తి చేస్తున్నారు. యాప్లో గ్యాస్ నంబర్ను ఎంటర్ చేయగానే ఫోన్, గ్యాస్ నంబర్తోపాటు ఇంటి చిరునామా తదితర వివరాలు వస్తాయి. వెంటనే వినియోగదారుడి ఫొటో తీసీ అప్లోడ్ చేస్తారు. ఈ కేవైసీ సక్సెస్ ఫుల్ అని రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఇందుకోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.