భూపాలపల్లి రూరల్/గణపురం, మార్చి 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు పదో తరగతి విద్యార్థులు డిబార్ అయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నిర్వహించిన టెన్త్ హిందీ పరీక్ష సందర్భంగా గణపురం మండలంలోని మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఫ్లయింగ్ స్కాడ్ బృందం సందర్శించి తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతుండగా పట్టుకొని వారిని డిబార్ చేసింది.
అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తొలగించింది. కాగా, జిల్లాలోని 20 కేంద్రాల్లో 3,546 మంది విద్యార్థులకు 3,534 మంది పరీక్ష రాశారని, 12 మంది గైర్హాజరయ్యారని డీఈవో తెలిపారు. భూపాలపల్లి మండలంలోని నాలుగు సెంటర్లను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి మందల రవీందర్రెడ్డి సందర్శించినట్లు ఆయన తెలిపారు.