హనుమకొండ, అక్టోబర్ 5 : జిల్లాలో శుక్రవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ శుక్రవారం పలు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లు పక్కగా చేయాలని ఆదేశించారు.
మంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా ఆర్ట్స్ కాలేజీకి చేరుకొని రూ.900 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేపడుతారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి కార్యక్రమానికి సంబంధిత శాఖ అధికారిని నోడల్ అధికారిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, ఏసీపీ బారీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగర పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పర్యటించే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ల్యాండ్రోమార్ట్, అలంకార్ జంక్షన్ల పరిశీలించిన మేయర్ సుధారాణి అధికారులకు పలు సూచనలు చేశారు. సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ ఏర్పాట్లను కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. మడికొండలో ప్రారంభించనున్న క్వాడ్రాంట్ ఐటీ టెక్నాలజీస్, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థులకు కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించనున్నారు. దీంతో పాఠశాలను సందర్శంచి, ఏర్పాట్లు చూశారు. అక్కడ ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో ఏర్పాట్లు లోటు జరుగకుండా చూడాలన్నారు. ఖిలావరంగల్లో జరిగే సంక్షేమ సభలో తాగునీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు, సీటింగ్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. శానిటేషన్, అర్బన్ మలేరియా, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతోపనిచేయాలన్నారు. వారి వెంట ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సీపీ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, హెచ్వో రమేశ్, ఈఈలు రాజయ్య, శ్రీనివాస్, సంజయ్కుమార్