ఎల్కతుర్తి, ఆగష్టు 11 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని ఇందిరానగర్లో రూ.20లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్ చొరవతోనేనని తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామానికి ఒక ట్రాక్టర్తో పాటు శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, హరితహారం, నర్సరీ తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు పల్లెలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయన్నారు.
అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారిందన్నారు. ఇందిరానగర్ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్ కడారి రమాదేవి, ఎంపీటీసీ బొంకూరి రజిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, మాజీ ఎంపీపీ మేకల కోమల, నాయకులు అల్లకొండ రాజు, వేముల శ్రీనివాస్, కడారి ప్రసాద్, అంబాల రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.