మడికొండ, ఏప్రిల్ 18: అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 46వ డివిజన్ మడికొండలో సుమారు రూ.2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ కాల్వ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. అలాగే, కాజీపేట మండలానికి చెందిన ఏడుగురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు, ఆరుగురికి రూ.1.49లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం పేద ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత సమరస్యానికి ప్రతీకగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొ నసాగుతోందన్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతిఒకరూ పండుగలను ఉత్సాహం గా, సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, మునిగాల సరోజన, ఆవా ల రాధికరెడ్డి, కుందూరు రాజేశ్రెడ్డి, ఊకంటి వనంరెడ్డి, బొల్లికొండ వినోద్కుమార్, పోలెపల్లి రామ్మూర్తి, దువ్వ నవీన్, దువ్వ శ్రీకాంత్, పల్లపు యాదగిరి, నర్మెటి భిక్షపతి, వల్లెపు ఉపేందర్, కొలిపాక కుమార్బాబు, పల్లపు కుమార్రాజ్, రొయ్యల లక్ష్మణ్, పేపర్ రవి, తాడూరి మోహన్, మాచర్ల శేఖర్, అల్లం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రంజాన్ కానుకల పంపిణీ
కాశీబుగ్గ : గ్రేటర్ మూడో డివిజన్ పైడిపల్లిలోని ఎల్లమ్మగుట్టపై ఉన్న దర్గాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అలాగే, 3, 14వ డివిజన్లలోని పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తున్నారన్నారు. మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, దర్గా పీఠాధిపతి అంకూషావలీ, బీఆర్ఎస్ నాయకులు జన్ను అనిల్కుమార్, అదాం, ఇట్యాల సతీశ్, రబ్బాని, యాకూబ్పాషా, అఫ్జల్ పాల్గొన్నారు.