జనగామ రూరల్/కరీమాబాద్, నవంబర్ 27 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను జనగామ మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం కలిశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్న ఆయన.. ఈ నెల 29న దీక్షా దివస్ విజయవంతానికి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో ఇటీవల నిర్వహించిన సన్నాహక సమావేశంతో పాటు 3వేల మందితో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే దీక్షా దివస్ నిర్వహణ తీరు. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లగా విజయవంతం చేయాలని కేసీఆర్ చెప్పినట్లు ముత్తిరెడ్డి తెలిపారు.