తొర్రూరు, ఏప్రిల్ 24: పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ సమావేశానికి స్థానిక పీఎస్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ సమీపంలోని స్థలంలో ఏర్పాట్లను బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సుమారు 5వేల మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, పార్టీ ముఖ్య శ్రేణులు సకాలంలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్కుమార్తోపాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు హాజరవుతారని చెప్పారు. మంగళపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, నియోజకవర్గ నాయకులు డాక్టర్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, ధరావత్ జైసింగ్నాయక్, రాయిశెట్టి వెంకన్న, ఉపేందర్, జాటోత్ సురేశ్