పాలకుర్తి/దేవరుప్పుల/రాయపర్తి, డిసెంబర్ 30: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేందుకుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పుల, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీల పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఎర్రబెల్లి తెలిపారు. వీటిని అమలు చేయకుండా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసి చూపారని, వ్యవసాయాన్ని పండుగలా మార్చారని ఎర్రబెల్లి తెలిపారు. రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్కు 50 లక్షల కోట్ల మేరకు ఆస్తులు పెంచిన విషయం గుర్తించలేదన్నారు. కాళేశ్వరం టూర్లో మంత్రుల తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బులు అందకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక కూడా నేటికీ రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంలేదన్నారు.
‘ప్రజాపాలన’లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, దీనిపై బీ ఆర్ఎస్ శ్రేణులు పోరాడాలన్నారు. తనహయాంలోనే పాలకుర్తి నియోజకవర్గంలో వం దల కోట్లతో అభివృద్ధి జరిగిందని, మిగిలిన పనులు పూర్తి చేయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలన్నారు. వాగులపై చెక్డ్యాములు, హైలెవల్ వంతెనలు, బీటీ రోడ్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. తాను నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల జడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాస్రావు, కేలోత్ సత్తమ్మ, బీఆర్ఎస్ కొడకండ్ల, పాలకుర్తి మండలాల అధ్యక్షులు సిందె రామోజీ, పసునూరి నవీన్, బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి వీరమల్ల రాజు, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. దేవరుప్పులలో జరిగిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, దునూరి నర్సింహారెడ్డి, కొల్లూరు సోమయ్య, ధరావత్ రాంసింగ్, కారుపోతుల భిక్షపతి, హనుమంతు, ఏల సుందర్, జోగు సోమనర్సయ్య, మొల్గూరు రమేశ్, ఆలకుంట్ల యాదగిరి, కోతి ప్రవీణ్ పాల్గొన్నారు. రాయపర్తిలో నిర్వహించిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, మం డలఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సురేందర్రావు పాల్గొన్నారు.