లింగాలఘనపురం, నవంబర్ 14 : పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుపోయగా వాటిలోంచి సమీప నీటి గుంటల్లో, వరి చేన్లలోకి వచ్చాయి.
వరి కోతలు మొదలవడంతో జనగామ జిల్లా లింగాల ఘనపురంలోని పలువురు రైతుల పొలాల్లో ఇలా చేపలు బయట పడుతున్నాయి. రెండు రోజుల నుంచి తన పొలంలో 20 కిలోల చేపలు పడ్డాయని ఏదునూరి వీరన్న చెప్పాడు.