కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి
రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
ఉగ్గంపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిన్నగూడూరు, మే 7 : రైతుల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం ఆయన మండలంలోని ఉగ్గంపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా రైతులు ఇబ్బందిపడొద్దనే సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు వడ్లు కొంటున్నట్లు తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని సూచించా రు.
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైతుబంధు, బీమా, ఉచిత విద్యు త్ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, ఎంపీపీ పద్మావెంకటరెడ్డి, జడ్పీటీసీ సునీతామురళీధర్రెడ్డి, తహసీల్దార్ రామకృష్ణ, ఏవో పద్మజ, సర్పంచ్ పూలమ్మ, ఎంపీటీసీ ఉదయమ్మ, ఏపీఎం పాప య్య, నాయకులు కొమురెల్లి, మల్లే శ్, గంగరాజు, అంబరీష తదితరులు పాల్గొన్నారు.