నమస్తే నెట్ వర్క్: యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. తొలివిడుత గత వానకాలంలో డబ్బులు అందజేయ గా, ప్రస్తుత యాసంగి రెండో విడుత ఆర్థికసా యం జమ చేస్తున్నది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నదాతలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ సంబురాలు జరుపుకున్నా రు. ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
పంట పెట్టుబడికి రంది లేదు..
– కొడారి కుమారస్వామి రైతు, నారాయణపురం
రేగొండ, డిసెంబర్28: కేసీఆర్ సారు ఇస్తున్న రైతుబంధు పైసలతో పంట పెట్టుబడికి రంది లేదు. ఏటా అప్పుల కోసం ఎవరి వద్దకు పోయే పనిలేదు. సారు ఇస్తున్న డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనడంతో పాటు దున్నేందుకు సాయపడుతున్నాయి. ఒకప్పుడు ఎవుసం చేయాలంటేనే ఇష్టం లేకుండేది. ఎందుకంటే అదనుకు పెట్టుబడి లేకుండె. నీళ్లు, కరంట్ లేక పంటలు ఎండిపోయి అప్పుల పాల య్యేటోళ్లం. గిప్పుడా బాధ లేదు. ఇష్టంగ ఎవుసం చేసుకుంటున్న.
పెట్టుబడి తిప్పలు తప్పినయ్..
– దున్నపోతుల ఉప్పలయ్య, రాయపర్తి
రాయపర్తి, డిసెంబర్ 28: కేసీఆర్ సారు కడుపు సల్లగుండ.. పెట్టుబడి తిప్పలు తప్పించిండు. ఎనుకటికో పంట ఎయ్యాల్నంటే మా తిప్పలు పడేది.. ఎక్కడ తిరిగినా పైసలు పుట్టకబోయేది. నారు పోసుడు, దున్నుడు, గొర్రు తోలుడు, కూలోల్లకు పైసలు ముందుగ ముట్టజెప్పుతనే పొలంల అడుగుపెడుతం అనేది. ఇక సావుకార్ల దగ్గరకు పోయి బతిలాడి బామాడి పైసలు దెచ్చుకునేది. పంట పండినక ఆళ్లు అడిగిన ధరకే పంటలిచ్చినా అప్పు లు తీరకపోయేది. కానీ గిప్పుడు గా పరిస్థితి లేదు. నాకున్న 24 గుంటలతోపాటు నా ముగ్గురు పోర గాండ్ల పేర్ల మీద ఉన్న భూమికి ఆళ్లకు యాళ్లకు పైసలు పడుతానయ్. సంబురమైతాంది.
అప్పుడు షాన కష్టముండె..
– పులిగిల్ల ఎల్లమ్మ, దేవరుప్పుల
దేవరుప్పుల: ఇయ్యాల 11 గంటలకు ఫోన్ల స ప్పుడు కాంగనే నా కొడుకు సూ సిండు. రైతు బంధు పైసలు పడ్డయని కేసీఆర్ ఫోన్ల రాసి పం పిండ ని చెప్పిండు. నిన్న మొన్నటి నుంచే టీవీలల్ల చూసిన. బుధవారం కేసీఆర్ పైసల్ పడుతయని చెప్పిండ్రు. అరెకురం భూమి నాపేర ఉంది. రూ. 2500 పడ్డయ్. యేడాదికి రూ. 5 వేలు వస్తున్న య్. పెట్టుబడికి అక్కడిక్కడికి సరిపోతుంది. బ్యాంకులకు పోయి తెచ్చిన. రైతు బంధు రానప్పు డు షాన కష్టపడేది. పెట్టుబడికి మస్తు యాతన అయ్యేది. కూలోల్లకు, ఎరువులకు పైసలు ఎల్లక నార్లు ముదిరిపోయేది. రైతు బంధుతో ఒకళ్లకు ఆశపడకుండ అయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యినంక రైతులకు మంచి రోజులు వచ్చినయ్.
యాళ్లకు పైసలిత్తాండు..
– ఇప్పకాయల రాజవీరు, రైతు, జంగేడు
కృష్ణకాలనీ, డిసెంబర్ 28: గప్పట్ల ఎవుసం చేయా లంటే సావుకారి దగ్గరికి వెళ్లి అప్పు తీసుకోని పెట్టుబడులు పెట్టెటోళ్లం. కేసీఆర్ దయతో రైతులకు ఇబ్బందులు తప్పి నయ్. రైతు బంధుతో ఎకరానికి రూ. 10వేలు ఇస్తూ రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుత్తాండు. గిట్ల ఎవ్వలియ్య లే.. ఏ సర్కారు కూడా రైతులను పట్టించుకోలేదు. ఇయ్యాల కేసీఆర్ సార్ యాళ్లకు పైసలిత్తాండు. ఇప్పుడు ఎవుసం రంది లేకుండా ఉన్నది. పొద్దంతా కరంట్ ఇత్తుండు.. ఎవుసానికి ఫుల్ నీళ్లు ఇత్తున్నడు. మళ్లోసారి కూడ ఈ సర్కారే రావాలి.
పదో మారు రైతుబంధు అందుకున్న..
– తాళ్లపల్లి రఘుగౌడ్, ఎల్లంపేట
మరిపెడ: పదోమారు రైతుబంధు పైసలు తీసుకున్నా. నాకు ఎకరం పొలం ఉంది. ఖరీఫ్ల రూ. 5 వేలు, రబీలో రూ.5 వేలు బ్యాంకు ఖాతాల్లో పడ్డయ్. పంటల అదునుకు రైతుబంధు ఇవ్వడం సంతోషంగా ఉంది. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నారు. కరంట్, నీళ్ల సమస్యలు తీర్చి పంట పెట్టుబడులు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతులు మరిచిపోరు.
ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం..
– బదావత్ ఓటి, రైతు, పగిడిపల్లి, చిన్నగూడూరు
చిన్నగూడూరు డిసెంబర్ 28: రైతుల పాలిట దేవుడు సీఎం కేసిఆర్. సాగుకు ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి పెట్టుబడి సాయం ఇస్తున్నడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం రాష్ట్రంలో కేసీఆర్ చేస్తూ రైతుల కష్టాలు తీర్చుతున్నా డు. గతంలో సాగు పనులు మొదలు పెట్టే సమయం వచ్చిం దంటే రైతుల గుండెల్లో దడ మొదలయ్యేది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయేటోళ్లు. గిప్పుడు ఆ బాధలు లేకుండా ఎకరానికి రూ.5వేల చొప్పన రెండు పంటలకు రూ.10 వేలు ఇస్తున్నాడు.