తొర్రూరు/పెద్దవంగర/గార్ల/గీసుగొండ, మార్చి 24 : అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఆర్థికసాయం చేసి రైతులకు కష్టాకాలంలో సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకులు, రైతులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా అకాలవర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తొర్రూరు మండలం కర్కాలలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుబడి సాయం, నాణ్యమైన ఉచిత కరంట్, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న ఏకైక సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సెగ్యం సురేఖ సురేందర్, ఉపసర్పంచ్ పసులాది వెంకన్న, ఇన్చార్జి మండల కో ఆప్షన్ మెంబర్ ఎస్కే అంకూస్, రామలింగారెడ్డి, రాజలింగం పాల్గొనారు. పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో గిరిజన రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్, బొమ్మకల్లు ఎంపీటీసీ బానోతు రవీందర్నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ తమ మారుమూల తండాకు వచ్చి, గిరిజన రైతుల కష్టాలు తెలుసుకొని సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ గిరిజన రైతులు సీతానాయక్, యాకు, భిక్షం, నరేందర్, సోమాని, చంద్రు, నరేశ్, శ్రీపాల్, గోరీ, దస్పా, ఆగమ్మ, వెంకన్న ఉన్నారు. గార్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పానుగంటి రాధాకృష్ణ, సర్పంచ్ బన్సీలాల్, మండల కో అప్షన్ మెంబర్ ఖాదిర్ బాబా, బీఆర్ఎస్ నాయకులు లింగాల ఉమేశ్, గుండా శ్రీనివాస్ రెడ్డి, తోట కొండల్రావు, మందనపు భాస్కర్ రావు, గాజుల గణేశ్ పాల్గొన్నారు.
గీసుగొండ మండలం ఊకల్, మరియపురంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులు సాంబయ్య, బాబురావు, కృష్ణమూర్తి, నర్సింగరావు, రాములు, ధనుంజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నష్ట పరిహారం రూ.10వేల చొప్పున ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే ఆర్థిక సాయం ప్రకటించి రైతులకు అండగా నిలిచారని స్పష్టం చేశారు. రైతులంతా సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని తెలిపారు. మరో 20ఏళ్లు తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వం రైతులను పన్నుల పేరుతో చంపుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచులు అల్లం బాలిరెడ్డి, నాగమణి, ఎంపీటీసీ వీరారావు, రైతులు ప్రభాకర్, కుమారస్వామి, సుధాకర్రావు, వీరారావు, వీరస్వామి, రఘసాల నర్సింగారావు, మహిళలు పాల్గొన్నారు.