దామెర/హసన్పర్తి, మార్చి 4 : సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. దామెర మండలం పులుకుర్తి, పసరగొండ గ్రామాల రైతులు సోమవారం ల్యాదెళ్ల, ఆరెపల్లి ఎస్సారెస్పీ డీబీఎం-31 వద్ద ఆందోళనకు దిగారు. అందక చివరి ఆయకట్టులోని మక్కజొన్న పంట ఎండిపోతోందని, ఎక్కువ నీటిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు సంజీవయ్య, రవి, సముద్రాల రాజు, సముద్రాల మధు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎక్కువ నీటిని విడుదల చేయాలని పది రోజులుగా ఎస్సారెస్పీ అధికారులను కోరుతున్నా స్పందించడం లేదన్నారు. ప్రస్తుతం మక్కజొన్న పంట వందలాది ఎకరాల్లో పీచుదశలో ఉందని, నీరులేక కళ్లముందే పంట ఎండిపోతున్నదని వాపోయారు. మెయిన్ కెనాల్ డీబీఎం-31కు ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే చిన్న కాల్వల ద్వారా పంటలకు నీరందుతుందని పేర్కొన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సారెస్పీ ఏఈ గోవర్దన్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు.
ఎక్కువ నీటి విడుదలకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు ముండ్రాతి రవి, మేడిపల్లి శ్రీనివాస్, పాలడుగుల సాంబయ్య, లింగాల రాజు పాల్గొన్నారు. అలాగే కమలాపూర్ మండల రైతులు సోమవారం హసన్పర్తి మండలం అనంతసాగర్ ఎస్సారెస్పీ కెనాల్పై ధర్నా చేశారు. ఎస్సారెస్పీ కెనాల్ నుంచి పిల్లకాల్వల ద్వారా వస్తున్న సాగునీటిని అనంతసాగర్ రైతులు ఆరోపించారు. ఫలితంగా నీరు అందక తమ పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ అధికారులు స్పందించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.