ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. క్రాప్లోన్ డబ్బు ఖాతాల్లో జమవుతున్నట్లు వస్తున్న మెసేజ్లను చూసి సంతోషపడుతున్నారు. రెండో రోజు సైతం హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణలు క్షీరాభిషేకాలు చేశారు. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. రైతుల కోసం రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని కొనియాడుతున్నారు. రైతు బాంధవుడికి రుణపడి ఉంటామని, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్
నర్సంపేట రూరల్, ఆగస్టు 4: రైతు సంక్షేమమే ధ్యేయంగా, వారి అభివృద్ధే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్న రైతు బాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్నదాతలు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాల మాఫీపై జిల్లావ్యాప్తంగా శుక్రవారం సంబురాలు వెల్లువెత్తాయి. కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. రైతన్నలకు రూ. లక్ష వరకు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
మండలంలోని గురిజాల రైతు వేదికలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్గౌడ్, ఉప సర్పంచ్ మంచిక హరీశ్గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, న్యాయవాది మోటూరి రవి, బండారి రమేశ్, గొడిశాల సదానందంగౌడ్తోపాటు పలువురు వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు రైతు కష్టాలు బాగా తెలునన్నారు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఏటా రెండు పంటలకు నీరందిస్తున్నారని కొనియాడారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తూ రైతుల పాలిట దేవుడయ్యారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, నాయకులు దూడెల ప్రకాశ్, కొమ్మ రవి, పత్రి కుమారస్వామి, బండారి చిన్న వెంకటేశ్వర్లు, యశోద నర్సింగం, పత్రి అశోక్, మండల కుమారస్వామి, చిన్నపెల్లి కరుణాకర్, పెద్దారపు వీరస్వామి, దూడెల ప్రవీణ్, చిర్ర భాస్కర్, రైతులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీని ప్రకటించి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని బీఆర్ఎస్ పాపయ్యపేట గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటానికి సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు అన్నదాతలు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ భూక్యా బాలూసింగ్, పీఏసీఎస్ డైరెక్టర్ మజ్జిగ రాంబాబు, రైతు కమిటీ అధ్యక్షుడు ఎం కట్టయ్య, దేవ్సింగ్, రవీందర్, గుర్రం రవి, సారంగం, యాకయ్య, కుండె భద్రయ్య, వీరస్వామి పాల్గొన్నారు.