అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. వేలాది మంది రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డును 2023లో అభివృద్ధి చేశారు.
ఇందులో భాగంగా ప్రధాన ద్వారం వద్ద ఓ రైతు తాను పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఎడ్లబండిపై తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్కు వస్తున్నట్లు నమూనా ఏర్పాటు చేయించారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ చిత్రాన్ని మార్కెట్కు వచ్చే రైతులతోపాటు దారి వెంట వెళ్తున్న వారు సైతం ఆగి.. నమూనా చిత్రం వద్ద నిల్చొని సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. – వరంగల్ ఫొటోగ్రాఫర్