జనగామ : జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో ( Grain Procurement ) జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ( Suicide Attempt ) పాల్పడ్డాడు. రైతుకు టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పి నెలరోజులుగా నిర్వాహకులు కాలయాపన చేస్తుండడంతో మనస్తాపానికి గురయ్యాడు.
తన టోకెన్ నెంబర్ 16 వచ్చినా అతనికి కాకుండా తరువాత వచ్చిన రైతుల ధాన్యం కాంటా వేయడంపై అధికారులను ప్రశ్నించిన తిరుమలేష్ టోకెన్ నెంబర్ 16 కాదు 76 అని మాటమార్చారు. నెల రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూసిన తిరుమలేష్ ఇంకా ఎన్ని నెలలు కళ్లంలోనే లోనే ఉంచుతారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. దీంతో స్థానిక రైతులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు.