సుబేదారి, జూన్ 6: నకిలీ పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను టాస్క్ఫోర్స్, పరకాల, గీసుగొండ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సన్ప్రీత్సింగ్ నిందితులను అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మారబోయిన తిరుపతి ములు గు ఘన్పూర్ మండలం పాపయ్యప ల్లికి చెందిన అన్నం కుమారస్వామి, మేడ్చల్కు చెందిన జయదీప్ గతమ్, మెహిదీపట్నంకు చెందిన ముద్దంగుల ఆదిత్య ముఠాగా ఏర్పడి మెహిదీపట్నంలో నకిలీ పురుగు మందులు తయారుచేసి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఇంటిలో పోలీసులు దాడులు చేయ గా రూ. 57.44 లక్షల విలువైన నకిలీ, కాలం చెల్లిన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు. జయదీప్ గౌతం, ఆదిత్య, కుమారస్వామిని అరెస్ట్ చేశామన్నారు.
గీసుగొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన మర్రిరెడ్డి, సంగారెడ్డి చింతల చెరువు గ్రామా నికి చెందిన తుమ్మగుండ్ల సందీప్రెడ్డి, తుమ్మగుండ్ల విజయజోసెఫ్ ముఠాగా ఏర్పడి రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు మర్రిరెడ్డి ఇంటిపై దాడి చేసి రూ. 6.18 లక్షల విలువైన 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, పరకాల, మామునూరు ఏసీపీలు సతీశ్బాబు, వెంకటేశ్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు బాబులాల్, సార్ల రాజు, రంజిత్, పరకాల, గీసుగొండ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బందిని సీపీ అభినందించారు.