కృష్ణకాలనీ, నవంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, క లెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి, అధికారులకు పలు సూచనలు చే శారు. పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తం గా ఉండాలని, ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించిన ఈవీఎంలను సదరు సిబ్బందికి అప్పజెప్పాలని, రిజర్వ్ ఈవీఎంలను సె క్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉంచాలన్నారు. పోలింగ్ సిబ్బం ది ఎన్నికల నియమ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 317 పోలింగ్ కేంద్రాలను 29 సెక్టార్లుగా విభజించామన్నారు. 25 శాతం బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన ఈవీఎంలు పంపిణీ చేశామనీ, ప్రతి సెక్టా ర్ అధికారి వద్ద 2 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 4 వీవీ ప్యాట్లు రిజర్వ్గా ఉంచామన్నారు. ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడకుండా సకల వసతులు కల్పించామన్నారు. జి ల్లాలో ఉన్న ఓటర్లందరూ తప్పని సరిగా గురువారం జరిగే పో లింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్ర తి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు అవసరమైన తాగునీరు, టా యిలెట్స్, ఇతర వసతులు కల్పించామన్నారు. దివ్యాంగుల కో సం ర్యాంపులు, ట్రైసైకిళ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, సమస్మాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. జిల్లాలో అధిక పోలింగ్ శాతం నమోదయ్యేలా విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు ఆలోచించి, స్వేఛ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
చిట్యాల : మండలంలో గురువారం ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో), తహసీల్దార్ సుమన్ తెలిపారు. మండలంలో 30,329 మంది ఓటర్లు ఉండగా 38 బూత్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్, బయట వీడియో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండల కేంద్రం, రామచంద్రాపూర్లోని పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి సందర్శించారు. మండల కేంద్రంలోని 166 పోలింగ్ కేంద్రాన్ని మహిళా నిర్వాహక, రామచంద్రాపూర్లోని 108వ పోలింగ్ కేంద్రాన్ని వ్యవసాయ ఆధారిత కేంద్రగా ఎంపిక చేయగా వాటిని అందంగా ముస్తాబు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, ఆర్ఐ రాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రేగొండ : మండలంలో గురువారం జరిగే పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహశీల్దార్ సత్యనారాయణస్వామి తెలిపారు. మండలంలోని 37 జీపీల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద వైద్య, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించామని, ఎలాంటి ఘర్షణలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలో 48,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
మొగుళ్లపల్లి : మండలంలో గురువారం నిర్వహించనున్న శాసన సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ సునీత తెలిపారు. మండల వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 148 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు చెప్పారు. సి బ్బంది బుధవారం సాయంత్రం మండలానికి చేరుకోగా వారికి కావాల్సిన వసతులు కల్పించామన్నారు.
టేకుమట్ల : మండలంలో గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో 28 పో లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రి తో ఆయా కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా ఎస్సై గట్ల సుధాకర్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.
గణపురం : మండలంలోని పోలింగ్ కేంద్రాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. మండల కేం ద్రంలోని 8 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నా రు. ఆయన వెంట ఎంపీడీవో అరుంధతి, డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్రావు, దేవేందర్, విజేందర్ తదితరులున్నారు.
శాయంపేట : మండలంలో గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 42 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం కేంద్రాలకు ఈవీఎంలు, సామగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. కేంద్రాల వద్ద అభ్యర్థుల గుర్తులతో కూడిన పేపర్లను అంటించారు. పెద్దకోడెపాక, పత్తిపాక, నేరేడుపల్లి, కొప్పుల, గట్లకానిపర్తి గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ నలుగురు బీఎస్ఎఫ్ ఆర్మీ బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక గ్రామాలతో పాటు పలు చోట్ల వెబ్ కెమెరాలను అమర్చారు. మండలంలో 33,4 59 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయం త్రం 4 గంటలకు ముగుస్తుందని అధికారులు తెలిపారు.