ములుగు రూరల్, డిసెంబర్ 21 : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 100 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్లు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తెలిపారు. గురువారం ఆయన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్వర్తో కలిసి దవాఖానను సందర్శించారు.
ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ 2020-2001లో కొవిడ్ ఉద్రిక్తంగా ఉన్నప్పుడు 100 బెడ్లతో వైద్యం అందించామన్నారు. ప్రస్తుతం అదే స్థాయిలో బెడ్లను ఉంచనున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. కేసులు పెరిగితే ముందస్తు చర్యలో భాగంగా వార్డులో ఆక్సిజన్ సైప్లె, కాన్సెంట్రేట్ పీఎస్ఏ ప్లాంట్లతో బెడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం దవాఖానలో ఐసొలేషన్ వార్డును గుర్తించారు.