– మంత్రి కొండా సురేఖ
ములుగు, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : మేడారం జాతర ముగిసే వరకు అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడంతోపాటు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు వర్తిస్తుందన్నారు. వాహనాల రద్దీ నియంత్రణ కొంత మేరకు సులువయ్యే అవకాశం ఉందని, ఇందుకోసం జిల్లా అటవీ శాఖ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.