ఖానాపురం, మే 23: నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ రవీందర్రావు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధరావుపేటలో పెద్ది ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందన్నారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కేవలం సన్న ధాన్యానికేఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ అని మాట మార్చిందని ఎద్దేవా చేశారు. బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశ్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, మస్తాన్, బీ శ్రీనివాస్, లింగయ్య పాల్గొన్నారు.
ధర్మసాగర్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలుపు కోసం గురువారం మండలంలోని దేవునూరు, సోమదేవరపల్లె, మల్లక్పల్లె, నారాయణగిరి, రాపాకపల్లె, ఉనికిచర్ల, ధర్మపురం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ యకులు, క్లస్టర్ ఇన్చార్జీలు ప్రచారం నిర్వహించారు. మండలాధ్యక్షుడు మునిగెల రాజు, ప్రభుదాస్, లాల్, బాలరాజ్, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గీసుగొండ : రాకేశ్రెడ్డి గెలిపించాలని బీఆర్ఎస్ యూత్ నాయకుడు జూలూరి లెనిన్ అన్నారు. మండలంలోని కొమ్మాల, గీసుగొండ, గ్రేటర్ వరంగల్ 15,16వ డివిజన్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. మోతీలాల్, నరేశ్, రమేశ్, గణేశ్ పాల్గొన్నారు.
సంగెం : రాకేశ్రెడ్డి గెలుపు తథ్యమని పట్టభద్రుల ఇన్చార్జి కత్తెరపల్లి దామోదర్ అన్నారు. యార బాలకృష్ణ, జున్న రాజుయాదవ్తో కలిసి దామోదర్ సంగెంలో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ సర్పంచ్ గుండేటి బాబు, చంద్రశేఖర్, బొమ్మల శంకర్, చిర్రా రాజ్కుమార్, యార రంజిత్కుమార్, కాగితాల ప్రశాంత్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్/ఖిలావరంగల్/నర్సంపేటరూరల్/నల్లబెల్లి : వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు గురువారం ఇంటింటా ప్రచారం చేశారు. ఇందులో భాగంగా వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నాయకులు డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ హరిశంకర్ పాల్గొన్నారు. అలాగే, ఖిలావరంగల్లో 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, నాయకులు బోగి సురేశ్, సంగరబోయిన విజయ్, ఉమేశ్, సుధాకర్, అజిత్, శరత్, ధర్మరాజు, అరుణ్, మంద శ్రీధరెడ్డి, అమర్వర్మ, ప్రభాకర్, రాజన్ ప్రచారం చేశారు. అంతేకాకుండా నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం, గురిజాల, గుంటూరుపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, క్లస్టర్ బాధ్యులు, నాయకులు విస్తృత ప్రచారం చేశారు. నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం, కన్నారావుపేట, బజ్జుతండా, గుండ్లపహాడ్, మామిండ్లవీరయ్యపల్లె, పంతులుపల్లెలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో నాయకులు పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేయాలని కోరారు. ప్యాక్స్ చైర్మన్ మురళీధర్రావు, నాయకులు శ్రీనివాస్గౌడ్, ప్రవీణ్గౌడ్, శ్రీనివాస్గుప్తా, బట్టు సాంబయ్య, పవన్, అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.
నెక్కొండ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ ఎన్నికల బీఆర్ఎస్ నర్సంపేట ఇన్చార్జి డాక్టర్ రవీందర్ కోరారు. నెక్కొండలో గురువారం క్లస్టర్ ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జిలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దగాకోరన్నారు. ఆయనకు ఓటేస్తే నట్టేట ముంచుతాడన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నెక్కొండ పట్టణ ఎన్నికల ఇన్చార్జి, సొసైటీ చైర్మన్ మారం రాము, మండల అధ్యక్షుడు సంగని సూర య్య, న్యాయవాది కొమ్ము రమేశ్యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి శివకుమార్, సొసైటీ మాజీ చైర్మన్ శివకుమార్, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు.