వర్ధన్నపేట, మార్చి 9: ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీఆర్ఎస్పై కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రం లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలను భయాందోళనకు గురిచేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధ న, మహిళా సాధికారత, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీజేపీ టార్గెట్ చేసి ఈడీతో నోటీసులు ఇప్పించడం విడ్డూరంగా ఉందన్నారు.
కవితపై కుట్రలు చేసి ఏమాత్రం ఇబ్బంది కలిగించినా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు నిత్యం అండగా ఉంటున్నారన్నారు. ఇక్కడి ప్రజలు బీజేపీని విశ్వసించరన్నారు. బీజేపీ విపక్షాలు, విపక్ష పార్టీల నేతలపై చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే రమేశ్ స్పష్టం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వా మి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు రవీందర్, రాజమణి, ఉన్నారు.