జనగామ, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ్వాన్ బాషా కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాలతో జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు గిరబోయిన భాగ్యలక్ష్మి, పోకల జమున, నర్మెట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను విన్నవించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి నాలుగు నెలలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ అవగాహన రాహిత్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతులకు బీఅర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, వాంకుడోతు అనిత, బొట్ల శ్రీనివాస్, పేర్ని స్వరూప, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, మండలాధ్యక్షుడు యాదగిరిగౌడ్, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, బీఆర్ఎస్ నాయకులు పసుల ఏబెల్, బండ యాదగిరిరెడ్డి, పెద్ది రాజిరెడ్డి, గద్దల నర్సింగారావు, గజ్జెల నర్సిరెడ్డి, రావెల రవి, ముద్దసాని వెంకట్రెడ్డి, ఆగారెడ్డి, ఉడుగుల కిష్ట య్య, తిప్పారపు విజయ్, ఉల్లెంగుల దిలీప్, దేవునూరి సతీశ్, రాజు పాల్గొన్నారు.