దుగ్గొండి, సెప్టెంబర్ 21 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 741 మందికి కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆర్థిక సాధికారతకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా, రైతుబంధు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్, వితంతు, వికలాంగులకు పింఛన్లు అందిస్తున్నదన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఏం కేసీఆర్పై నిరాధార అరోపణలు చేస్తున్నారన్నారు. వ్యవసాయ బావుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని చెప్పారు. పచ్చగా ఉన్న పల్లెల్లో బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెట్టుబడిదారుల చేతిలో ప్రధాని మోదీ కీలు బొమ్మగా మారారని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల రైతులు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారన్నారు. గ్రామాల్లో వందశాతం సీసీ రోడ్లు వేయిస్తానమ్నరు. దసరా కానుకగా స్ధలం ఉన్న అర్హులందరికీ పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసి రూ.3లక్షలు ఇస్తామన్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన..
నల్లబెల్లి-దుగ్గొండి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే పెద్ది అభ్యర్థన మేరకు ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన రూ.15 కోట్లతో ఈ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు దుగ్గొండి నుంచి గిర్నిబావి వరకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, దుగ్గొండి, నల్లబెల్లి ఎంపీపీలు కాట్ల కోమల, ఊడుగుల సునీత, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్రెడ్డి, ఎన్నారై రాజ్కుమార్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు సుకినె రాజేశ్వర్రావు, ఊరటి మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.