వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దని, అధికార దాహంతో ఉన్న ఆ పార్టీ నాయకులు అడ్డగోలు హామీలిస్తున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ నామినేషన్ అనంతరం ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రత్నాల పాలన ఉండగా, నత్తగుల్లలు మనకెందుకని మంత్రి సత్యవతి ఫైర్ అయ్యారు. దోపిడీకి గురవుతున్న తెలంగాణ వనరులను కాపాడేందుకే కేసీఆర్ 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి, ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 24 గంటల ఉచిత కరెంట్, పంట పెట్టుబడి కోసం రైతుబంధు, పుష్కలంగా సాగునీళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి లోకల్ అని, అందరం సమష్టిగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఎమ్మేల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
మరిపెడ, నవంబర్ 8 : వారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ డోర్నకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ నామినేషన్ అనంతరం ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ అధికార దాహం కోసం చేసే గ్యారెంటీలను ప్రజలు నమ్మరని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్టానికి తీరని అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ సాధన మొదలు, విభజన హామీల వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఇప్పటి వరకు నోరువిప్పడం లేదన్నారు. దోపిడీకి గురవుతున్న తెలంగాణ వనరులను కాపాడేందుకే కేసీఆర్ 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి, ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 24 గంటల ఉచిత కరెంట్, పంట పెట్టుబడి కోసం రైతుబంధు, పుష్కలంగా సాగునీళ్లు అందజేసిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సాగురంగంతోపాటు కులవృత్తిదారులకు సైతం పల్లెల్లోనే ఉపాధి కల్పించి, పూర్వవైభవం తెస్తున్నట్లు తెలిపారు. మత్య్సకారులు, గొల్లకుర్మలు, గీత, చేనేత, నాయీబ్రాహ్మణ, రజక తదితర కులవృత్తిదారులకు అందుతున్న సంక్షేమంతో వారి కుటుంబాల్లో ఆనందం నెలకొందన్నారు. రూ.10 లక్షలతో దళితబంధు పథకంతో అణగారిన వర్గాల జీవితాల్లో గణనీయమైన మార్పు రానున్నదని తెలిపారు. మళ్లీ అధికారంలో రాగానే ఇంటింటికీ సన్నబియ్యం, రూ.400కే వంట గ్యాస్, రూ.16 వేల రైతుబం ధు, రూ.5లక్షల కేసీఆర్ బీమా, రూ.5016లు ఆసరా పింఛన్లు అందజేస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిండైన దీవెనలు అందించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రెడ్యానాయక్ లోకల్ అని, ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతని అన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి రెడ్యాను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులోనే గందరగోళానికి గురై స్థానికేతరుడిని బరిలోకి దింపి పరువు పోగొట్టుకున్నదన్నారు. వందకు పైగా స్థానాలను గెలిచి ముడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఆంజనేయుడు లేని ఊరు..
సీఎం కేసీఆర్ సుభిక్షమైన పాలనలో ఆంజనేయుడి విగ్రహం లేని గ్రామం, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణను అభివృద్ధి చేసి సమస్యలు లేకుండా చేశారని అన్నారు. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆసరా పింఛన్లు కనీసం రూ.వెయ్యి కూడా దాట లేదన్నారు. దళితబంధు, బీసీ, మైనార్టీ బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచిత సుఖ ప్రసవాలు, మహిళలకు తక్కువ వడ్డీకే రుణాల వంటి పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఓటుకు నోటు దొంగ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో కాంగ్రెస్ పార్టీ చేయికాల్చుకున్నదని, తెలంగాణ కమలం వాడిపోయిందన్నారు. బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీ.., రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ని ఎందుకు తప్పించారో ప్రజలకు వివరించాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి విశేషమైన కృషి చేస్తున్నదని, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జల్లా సమన్వయ కర్త నూకల నరేశ్రెడ్డి అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా ప్రజాజీవితంలో ఉన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమాగంగా ఉన్న మహబూబాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, మెడికల్, ఇంజినీరింగ్, హార్టికల్చర్ కళాశాలలు ఏర్పాటు చేయండంతో సుస్థిరమైన ప్రగతి సాధిస్తున్నదన్నారు.
డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు 40 ఏండ్లుగా నిత్యం అందుబాటులో ఉండి సేవ చేశానని బీఆర్ఎస్ డోర్నకల్ అభ్య ర్థి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, రామసహాయం రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, నియోజకవర్గ శ్రేణులు ఒకే వేదిక మీద, సమష్టిగా ఉండడం తనకెంతో గర్వకారణంగా ఉందని, నిండైన ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు సాగునీళ్లు, నాణ్యమైన బోధన, మెరుగైన వైద్యం అందించాలన్నదే తన చిరకాల స్వప్నమన్నారు. మరిపెడను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. మరిపెడ పట్టణంలో రూ.36 కోట్లతో వంద పకడల దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. డోర్నకల్ నియోజవర్గంలో తనపై పోటీ చేసేందుకు అభ్యర్థి లేక కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటకు చెందిన డాక్టర్ను తీసుకొచ్చిందన్నారు. సూర్యాపేట వైద్యశాలలో డబ్బులు తీసుకుని పనిచేసే డా. రాంచంద్రునాయక్ రోగులకు ఎప్పుడు వైద్యం చేయాలి, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలన్నారు. గత ఎన్నికల ముందు మరిపెడలో ఉచిత వైద్యం పేర గాంధీ ఆసుపత్రిని నెలకొల్పి పత్తాలేకుండా పోయిన విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. స్థానికేతరుడికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరెడ్డి, హాకా చైర్మన్ మచ్చ శ్రీనివాస్రావు, రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, కొమ్మనేని రవీందర్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, ప్రజాప్రతినిధులు గుగులోత్ అరుణారాంబాబు, టేకుల సుశీలాయాదగిరిరెడ్డి, వల్లూరి పద్మావెంకటరెడ్డి, చాపల యాదగిరిరెడ్డి, బండి వెంకటరెడ్డి, కమలారామనాథం, అశోక్రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, కుడితి మహేందర్రెడ్డి, గండి మహేశ్, పిట్టల ధనుంజయ, సత్యనారాయణరెడ్డి, నున్న రమణ, మైదం దేవేందర్, మధుసూదన్రెడ్డి, నూకల అభినవ్రెడ్డి, అయూబ్ పాషా, సయ్యాద్ లతీఫ్ పాల్గొన్నారు.