కేసముద్రం, జనవరి 25 : కల్యాణలక్ష్మి పథకంతో ప్రభుత్వం పేద బిడ్డలకు అండగా ఉంటున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో 109 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాట్రపల్లి గ్రామం నుంచి భవానిగడ్డ తండాకు, జిల్లెల తండాకు రూ.4.50 కోట్లతో బీటీ రోడ్డు పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, తహసీల్దార్ ఫరీద్, ఎంపీడీవో రోజారాణి, మండల అధ్యక్ష కార్యదర్శులు నజీర్ అహ్మద్, కముటం శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్రెడ్డి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.