హనుమకొండ సిటీ, ఆగస్టు 13 :వరద ముంపు బాధితులకు ప్రజలంతా అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో భారీ వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సరం మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకేరోజు కురవడంతో చారిత్రక ఓరుగల్లు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. నగరవాసుల ఇక్కట్లను గమనించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారని, ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు, మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన సామగ్రిని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వరదల వల్ల ఇళ్లు ధ్వంసమైన వారు ‘గృహలక్ష్మి’కి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
వర్షం కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు ప్రజలంతా బాసటగా నిలవాలని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాసర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను చీఫ్ విప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఏడాది కాలంలో పడే వర్షం నగరంలో ఒకరోజులోనే పడడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది కలిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. బాధితులకు ఎన్డీఆర్ఎఫ్, రెస్యూ టీమ్స్ నిత్యావసర సామగ్రిని బాధితులకు అందించినట్లు తెలిపారు. బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు శౌరి రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా సమన్వయం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద బాధితులకు రూ.3,000 విలువ గల దోమతెరలు, ఇంటి పైకప్పుల కోసం టార్పాలిన్ కవర్లు, బకెట్, బ్రష్లు, నిత్యావసర వస్తువులు అందించినట్లు తెలిపారు. వరదల వల్ల ఇండ్లు కూలిపోయిన వారు గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ పాషా, కార్పొరేటర్ చీకటి శారదా ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు భరోసా
న్యూశాయంపేట బీఆర్ఎస్ పార్టీ సభ్యత్యం తీసుకున్న ప్రతి కార్యకర్త అనివార్య కారణాల వల్ల ప్రమాదానికి గురైతే వారి కుటుంబానికి పార్టీ భరోసాగా నిలుస్తోందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ 31వ డివిజన్ లోని దీన్దయాళ్నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మేకల రఘపతి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా బాధిత కుటుంబానికి పార్టీ తరఫున మంజూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి చీఫ్ విప్ అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ పశ్చిమ నియోజక వర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.