ఐనవోలు, జూలై 11: అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ మధుమతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలభివృద్ధికి ఇప్పటి వరకు రూ.173 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. త్వరలో గృహలక్ష్మి పథకం అమలు కానుందనీ, అలాగే దళిత బంధు రెండో విడుత మంజూరు కానున్నట్లు తెలిపారు. 20 మంది బాధితులకు మంజూరైన రూ.5 లక్షల 80 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి అరూరి విశాల్, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ సంపత్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ జైపాల్, వైస్ ఎంపీపీ మోహన్, దర్గా సొసైటీ వైస్ చైర్మన్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మండల కోఆప్షన్ గుంషావలీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి రవీందర్, అనుబంధ సంఘాల మండల అధ్యక్ష, కార్యదర్శులు డీకే, విజయ్భాస్కర్, సురేశ్, అబ్బాస్అలీ, కోమలత, నరేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.