హనుమకొండ చౌరస్తా, మే 2 : కేయూ నుంచి దూరవిద్య పూర్తి చేసిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. 30 ఏళ్లుగా ఉత్తర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎంపిక చేసిన కేంద్రాల నుంచి లక్షల మంది విద్యార్థులు దూరవిద్య ద్వారా ఉన్న త విద్యను పూర్తి చేశారని తెలిపారు.
వీరందరినీ ఒక తాటి పై తీసుకురావాలనే ఉద్దేశంతో పూర్వవిద్యార్థుల వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పూర్వ విద్యార్థి తమ పేర్లను www.sdlceku.co.in ద్వారా లాగిన్ అయి తమ డిగ్రీ, పేరు, డిగ్రీ పొందిన సంవత్సరం, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలని సూచించారు. జూన్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.