మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సెలవు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రావడంతో గద్దెల ప్రాంగణం రద్దీగా మారింది.