రేగొండ, మార్చి 25 : గోవింద నామస్మరణతో కోటంచ మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. కోరిన కోర్కెలు నెరవేరినందుకు స్వామి వారికి ఏనుగు వాహనాలు, మేకలు, గుర్రం బండ్లను ప్రత్యేకంగా తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు, తాగునీటి వసతి, స్నానఘట్టాలు, తదితర ఏర్పాట్లుచేశారు. ఆలయ చైర్మన్ మల్కనూరి భిక్షపతి, ఈవో బీ శ్రీనివాస్, ధర్మకర్తలు శ్రీపతి సుదర్శన్, మూల ఓంకార్, మల్లెబోయిన శ్రీధర్, డోలి కోటేశ్వర్రావు, జోగేందర్, గుర్రాల శ్రీనివాస్రెడ్డి, కళావతి, లక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైద్యాధికారి హిమబిందు ఆధ్వర్యంలో భక్తులకు వైద్య సేవలందిస్తున్నారు. ఎన్ఎస్ఆర్ సంస్థల ఆధినేత నాయినేని సంపత్రావు భక్తులకు 30వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.