నర్సంపేట రూరల్, ఆగస్టు 13 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల రవితో పాటు మరో 10 మంది ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు కోమాండ్ల గోపాల్రెడ్డి, వల్గుబెల్లి ప్రతాప్రెడ్డి, ఉప సర్పంచ్ మిట్టగడపల తిరుపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మిట్టగడపల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు దూపటి మధుసూదన్, సీనియర్ నాయకులు పెండ్యాల భిక్షపతి, పెండ్యాల మునేందర్, అల్లె రాజు, వల్గుబెల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
చెన్నారావుపేట : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలంలోని క్లస్టర్ బాధ్యుడు కృష్ణచైతన్యరెడ్డి ఆధ్వర్యంలో అక్కల్చెడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. పార్టీలో చేరిన వారిలో ముత్యం యాకయ్య, ఒంటరి రాజు, శ్రీకాంత్, ఉప్పలయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు రఫీ, మాజీ సర్పంచ్ భూక్యా కిషన్, తండా పెద్దలు పాల్గొన్నారు.