‘జీపీల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనదే. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీళ్లు లేక, కరంటు రాక ఇబ్బందులు పడిన అన్నదాతను ప్రత్యేక తెలంగాణలో ఆదుకున్నదీ.. వ్యవసాయాన్ని పండుగలా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.’ సమీకృత కలెక్టరేట్తో ప్రజల అన్ని సమస్యలకూ ఒకే చోట పరిష్కారం లభిస్తుందని మానుకోట జిల్లాలోని సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల వరదతో జిల్లా ప్రగతి బాట పట్టడం ఖాయమని సంబురపడుతున్నారు.
సీఎం కేసీఆర్ కృషితోనే వ్యవసాయరంగం అభివృద్ధి..
కేసముద్రం జనవరి 12 : గత పాలకులు వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే సీఎం కేసీఆర్ సాగుకు పెద్దపీట వేసి రూ. వేల కోట్లు కేటాయిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బలోపేతం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను చెరువులకు మళ్లించడంతో భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల మెరుగైన విద్యుత్, పంట పెట్టుబడి సాయం ఎకరానికి రూ.10 వేలు అందింస్తుండడంతో రైతులు ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా కొండంత అండగా ఉన్నది. రైతులను అదుకుంటున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– గండి పుల్లయ్య, సర్పంచ్, ఎల్లంపేట, కేసముద్రం
ఏళ్ల కల సాకారమైంది..
కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేంద్రం కావాలనే ఎన్నో ఏళ్ల కళ సీఎం కేసీఆర్ వల్లే సాకారమైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా అధికారులు అందుబాటులో ఉండడంతో పేదలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయి. పరిపాలన వేగవంతం అయింది. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.
– వేం నర్సింహారెడ్డి, సర్పంచ్, కేసముద్రం
సీఎం కేసీఆర్ దయ వల్లే సర్పంచ్నయ్యా..
మహబూబాబాద్ రూరల్, జనవరి 12 : సీఎం కేసీఆర్ దయ వల్లే సర్పంచ్ అయ్యే అవకాశం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలోని తండాలను గ్రామ పంచాయతీలుగా చేయటం వల్లే సర్పంచ్నయ్యా. సీఎం ఇచ్చిన నిధులతోనే జీపీలు ప్రగతి పథంలో నడుస్తున్నవి. స్థానికంగా ఉంటూ వెంటనే సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– గుగులోత్ లక్ష్మి, సర్పంచ్, రేగడితండా
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి..
డోర్నకల్ : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి, రైతు సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సాగుకు 24 గంటల ఉచిత కరంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి.
– పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకటేశ్వర్లు, డోర్నకల్
జీపీలకు నిధుల మంజూరు హర్షణీయం..
బయ్యారం, జనవరి 12 : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు మంజూరు చేయడం హర్షణీయం. నెలనెలా నిధుల మంజూరుతో పల్లెల్లో అభివృద్ధి వికసిస్తున్నది. ఇప్పటికే పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, శ్మశాన వాటిక నిర్మాణం, హరితహారంతో పల్లెల రూపురేఖలు మారాయి.
– వీరబోయిన కవిత, ఉప సర్పంచ్, బయ్యారం
ఇంజినీరింగ్ కాలేజీతో గిరిజనులకు లాభం..
నర్సింహులపేట, జనవరి 12 : సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైద్య కళాశాల పూర్తి చేసి మారుమూల గిరిజనులకు వైద్య విద్య అందిస్తున్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో గిరిజన విద్యార్థులకు లాభం చేకూరనుంది.
– అజ్మీరా లక్ష్మి, సర్పంచ్, గోపతండా, నర్సింహులపేట
గిరిజనులకు రాజ్యాధికారం సీఎం చలవే..
డోర్నకల్ : గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీగా మార్చి గిరిజనులకు రాజ్యాధికారం కల్పించిన గొప్ప నేత సీఎం కేసీఆర్. జీపీలకు రూ.10 లక్షల నిధులు ప్రకటన హర్షదాయకం. సర్పంచ్లు ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటారు.
– ధరంసోత్ బాలూ నాయక్, ఎంపీపీ, డోర్నకల్
సీఎం కేసీఆర్తో మహబూబాబాద్కు మహర్దశ..
డోర్నకల్ : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసి అనతి కాలంలోనే ప్రజలకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా సీఎం కేసీఆర్ మారారు. ముఖ్యమంత్రి వల్లే మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
– పొడిశెట్టి కమల, జడ్పీటీసీ, డోర్నకల్