అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించగా, కొద్ది రోజుల వ్యవధిలోనే వెయ్యికిపైగా అప్లికేషన్లు అందాయి. సీఈవోను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విశ్వకాంత్ చతుర్వేది, రిటైర్డ్ అణుశాస్త్రవేత్త సురేష్ హవారేలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణకు జూలై 18 చివరి తేదీ.