ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మళ్లీ ఎన్డీయేవైపు చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఎన్సీపీ మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్సీపీ రెండు వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ నాయకత్వంలో అర్ధరాత్రి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా శరద్పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ సీనియర్ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఎన్డీయే దేశ వ్యాప్తంగా ఒకే స్థాయిలో 50 శాతం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెంచితే తాము మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.