చెన్నారావుపేట, మార్చి11 : సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు. అయితే వారానికోసారి కాల్వలో నీళ్లు వస్తుండడంతో చివరి ఆయకట్టు పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల చెరువులు, బావుల్లో నీరు అడుగంటడంతో రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి పూడికతీత పనులు చేపడుతున్నారు. పదేళ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదని, అధికారులు స్పందించి పంటలు చేతికందే వరకైనా కాల్వలో నీరు వదలాలని డిమాండ్ చేస్తున్నారు.