గీసుగొండ, నవంబర్ 7 : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని, అదే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే సంక్షేమ ఫలాలు పొందొచ్చని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ 15వ డివిజన్లోని పోతురాజుపల్లి, గొర్రెకుంట, 16వ డివిజన్ కీర్తినగర్, గరీబ్నగర్, జాన్పాకలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ అంధకారం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. గ్యారెంటీలకు నమ్మి ఓట్లు వేయవద్దని కోరారు. ఆనాడు రూ.200 ఫింఛన్ ఇవ్వలేని పార్టీ ఇప్పుడు రూ.4 వేల పింఛన్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ వైపు ప్రజలు చూడడం మర్చిపోయారన్నారు. గీసుగొండ మండలంలో లింకు రోడ్లు, అంతర్గత రోడ్లు వేసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ పరకాల అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని కార్యకర్తలను మోసం చేసి ఇక్కడకు వచ్చాడని, నర్సంపేటలో చెల్లని రూపాయి పరకాలలో ఎలా చెల్లుతుందని విమర్శించారు. బీజేపీలో చేరి అనేక కాం ట్రాక్టులు పొంది, తర్వాత ఆ పార్టీని మోసం చేసి తన అ వసరం కోసం కాంగ్రెస్లో చేరాడన్నారు. ఆయనతో వెళ్లి న నాయకులు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు చూస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషాశివకుమార్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానం దం, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు సుంక రి శివకుమార్, బాబురావు, ధర్మేంద్ర, రేణుక, బాల య్య, విజయ్, లవ్రాజు, నర్సయ్య, నవీన్, కొండా రా ధ, లక్ష్మణ్రావు, గజ్జి రాజు, చిన్నస్వామి, రాజయ్య, కొ మ్ముల కిశోర్కుమార్, ముంత రాజయ్య, రమేశ్, నాగరాజు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఖిలావరంగల్ : గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్, అడ్రస్సే లేని పార్టీ బీజేపీని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే చల్లా అన్నారు. మంగళవారం రాత్రి గ్రేటర్ 17వ డివిజన్లోని స్తంభంపల్లి, వసంతపురం, దూపకుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపిన బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దని కోరారు. 50 ఏళ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు తీసుకురాని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దె బాబు పాల్గొన్నారు.