హనుమకొండ, జులై 02 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన వర్ధంతి వేడుకల్లో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ముందకు ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కొమురయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్య తిరేకంగా పోరాడి అమరుడైన బహుజన బిడ్డ దొడ్డి కొమురయ్య అని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా అన్న బడుగు జీవుల చేత ఆయుధాలు పట్టించిన వీరుడు అని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం, పన్నులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు.
కొమురయ్య బలి దానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులకు గుర్తింపును ఇచ్చి, వారి జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వ హించిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, దూలం వెంకన్న, దేవుళ్లపెల్లి జానికిరాములు, పోలపెల్లి రామ్మూర్తి, విద్యార్థి నాయకులు రాకేష్ యాదవ్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.