హనుమకొండ, జూలై 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలోని మహిళలకు రక్షణ కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం జాతీయ సమితిల పిలుపు మేరకు మంగళవారం హనుమకొండలోని కాళోజీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మణిపూర్ ఘటనలో బాధితులకు సంఘీభావం తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాలపై దాడులు పెరిగాయన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ వర్గాల ప్రజలకు పూర్తి రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లోని మాదిరిగా మహిళల మాన ప్రాణాలను హరించేందుకేనా డబుల్ ఇంజిన్ సరార్ రావాలని బీజేపీ కోరుకునేదని ప్రశ్నించారు. మణిపూర్ ఘటన జరిగి మూడు నెలలు కావస్తున్నా ప్రధాని మోదీ పార్లమెంటుకు సమాధానం చెప్పలేదన్నారు. మణిపూర్ ఘటనపై తక్షణమే అకడి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాల క్ష్మి, సభ్యులు ఉటూరి రాములు, కర్రె లక్ష్మణ్, నకీర్త ఓదెలు, కొట్టెపాక రవి, ము నిగాల భిక్షపతి, జకు రాజు గౌడ్, మంచాల రమాదేవి, భాషబోయిన సంతోష్, బొట్టు భిక్షపతి, కుమార్, స్వరూ ప, సీపీఎం జిల్లా నాయకులు నోముల కిశోర్, భానూనాయక్, టీ మల్లేశం, కే కుమారస్వామి, యాకయ్య, ఓరుగంటి సాంబయ్య, రమ, రాజేశ్ పాల్గొన్నారు.