హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27: మేడారం జాతర హుండీలు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం 512 హుండీలను మంగళవారం ఆర్టీసీ కార్గో బస్సుల్లో తీసుకువచ్చారు. ఈనెల 29 నుంచి హుండీలు లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.