కాశీబుగ్గ, జనవరి 4 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్చాడు. తిరుమల ట్రేడర్స్ అడ్తి ద్వారా సిరివల్లి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి రూ.8,310తో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు తమ అవసరానికి పత్తిని అమ్ముకుంటున్నట్లు చెప్పారు.
ఈ సీజన్లో పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చాలా వరకు రైతుల పత్తిని నిల్వ చేసుకున్నట్లు తెలిపారు. కాగా, బుధవారం మధ్యరకానికి రూ.7,900, కనిష్ఠంగా రూ.7,400 ధర పలికినట్లు చెప్పారు. మార్కెట్కు సుమారు 2,344 బస్తాలు వచ్చినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. కాగా, ఈ సీజన్లో అక్టోబర్ నుంచి పత్తి ధరలు తగ్గుతూ వచ్చాయి. నవంబర్లో అత్యధికంగా రూ.9015 ధర పలికింది.