కాశీబుగ్గ/కేసముద్రం, జనవరి 6 : పత్తి ధర పరుగులు పెడుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డులు సృష్టిస్తున్నది. గురువారం కేసముద్రం మార్కెట్కు 969 పత్తి బస్తాలు రాగా, క్వింటాల్కు రూ.10101 పలికింది. అదేవిధంగా మహబూబాబాద్, వరంగల్ ఎనుమాములలో 9826, 9750తో వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎనుమాముల ఏఎంసీకి జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎన్టీఆర్ నగర్కు చెందిన ముస్కు సుధాకర్ 77 బస్తాల పత్తి తీసుకు వచ్చాడు. గాయత్రి ట్రేడర్స్ అడ్తి కమీషన్ ద్వారా ఓంప్రకాశ్ కాటన్ ఇండస్ట్రీస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.9750 ధరతో కొనుగోలు చేశారు. మార్కెట్కు 5,740 క్వింటాళ్ల పత్తి రాగా, అత్యధికంగా రూ.9750, మధ్యరకానికి రూ. 9500, కనిష్ఠంగా రూ. 8000 ధరలు పలికాయి. ఈ సీజన్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3లక్షల 85వేల 665 క్వింటాళ్ల పత్తి వచ్చింది.
కేసముద్రం ఏఎంసీలో సంబురాలు
పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం రూ.50 వేల కోట్లు విడుదల చేయడంపై రైతుబంధు వారోత్స వాలతోపాటు మార్కెట్లో పత్తి ధర ఆకాశాన్ని అంటడంతో కేసముద్రం ఏఎంసీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పూ లాభిషేకాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. రైతులను, వ్యాపారులను సన్మానించారు. సంక్రాంతి పండుగ సమయంలో పత్తి ధర కలిసి రావడం రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.