గూడూరు, డిసెంబర్ 27 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మర్రిమిట్ట గ్రామంలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు బాలికల్లో ఒకరు మరిపెడ బంగ్లా, మరొకరు మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాలలో పది, ఏడో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరు క్రిస్మస్ పండుగ సెలవులకు ఇంటికి వచ్చారు. వారికి దగ్గు, జ్వరం ఉండడంతో స్థానిక సీహెచ్సీలో ర్యాపిడ్ పరీక్షలు చేయించారు. వారిలో చిన్న అమ్మాయికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ వీరన్న బుధవారం తెలిపారు.